AP Grama Sachivalayam : 4 గ్రామ వాలంటీర్లపై వేటువేసిన AP ప్రభుత్వం || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-10-04

14.2K Views

02:11

Newly Joined Village Volunteers Terminated By AP Government Because they demand bribe for pensions. ap Govt seriously reacted on thiese issue and orderd distritct officials to take immeadiate action over them.
#APGovernment
#VillageVolunteers
#pensions
#krishnadist
#Machilipatnam
#cmjagan

ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వాలంటీర్లు వ్యవస్థలో అప్పుడే దందాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ముఖ్యమంత్రి చేసిన సూచనలు బేఖాతర్ అవుతున్నాయి. ప్రభుత్వం పతీ 50 నివాసాలకు ప్రభుత్వ పధకాలు అందించేందుకు ఒక వాలంటీర్ ను నియమించింది. వీరిని గ్రామ .. వార్డు సచివాలయాలకు అనుసంధానం చేసారు. వీరు ఎటువంటి తప్పులు చేసిన నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందు కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కేటాయించారు. అయితే..వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించి ఇంకా పూర్తిగా నెల రోజులుగా కూడా కాకుండానే అప్పుడే వాలంటీర్ల పైన ఫిర్యాదులు మొదలయ్యాయి. వసూళ్ల దందా ప్రారంభించారు. దీని పైన నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు రావటంతో జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేయించారు. నిరూపణ కావటంతో నలుగురు వాలంటీర్ల పైన వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Trending Videos - 2 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 2, 2024