ఫోన్​ ట్యాపింగ్​కు మా పర్మిషన్ అక్కర్లేదు- కేంద్రం

ఫోన్​ ట్యాపింగ్​కు మా పర్మిషన్ అక్కర్లేదు- కేంద్రం

Telangana Phone Tapping Case Updates : గత ప్రభుత్వం చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌లో ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేదంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. అంతేగాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్​కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇచ్చినట్లు కూడా పేర్కొనలేదని పేర్కొంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్‌ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఫోన్ ట్యాపింగ్‌కు తమ అనుమతి అవసరంలేదని వివరించింది. రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్​ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్​పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆలోక్​ అరాదే, జస్టిస్​ టి.వినోద్​ కుమార్​లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2024-08-21

Duration: 05:24

Your Page Title