తిరుమల శ్రీవారి సేవలో హీరో అఖిల్‌ అక్కినేని

తిరుమల శ్రీవారి సేవలో హీరో అఖిల్‌ అక్కినేని

HERO AKHIL AKKINENI AT TIRUMALA: తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్, సినీ నటుడు అక్కినేని అఖిల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి అభిషేక సేవలో వారు పాల్గొన్నారు. అంతకముందు టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని వేరు వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-12-20

Duration: 01:12

Your Page Title