రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండగ శోభ

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండగ శోభ

Sankranti Celebrations in AP 2025 : రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి శోభ నెలకొంది. చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగవల్లులలో గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు, పూలు చల్లారు. బంధువులంతా ఒక్కచోట చేరి పిండివంటలు, విందు భోజనాలతో ఉత్సాహంగా గడిపారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలతో చిన్నాపెద్ద ఉత్సాహంగా గడిపారు. పండగ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-01-14

Duration: 01:45

Your Page Title