అమరావతిలో మరో కీలక ముందడుగు | funds Approved for Employee Towers: Minister Narayana | Asianet Telugu

అమరావతిలో మరో కీలక ముందడుగు | funds Approved for Employee Towers: Minister Narayana | Asianet Telugu

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో గజిటెడ్, నాన్ గజిటెడ్ ఉద్యోగుల నివాసానికి సంబంధించి నాలుగు ప్యాకేజీల్లో టవర్ల నిర్మాణం కోసం రూ.1,732.31 కోట్ల విలువైన పనుల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెల్పిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 47వ సీఆర్డిఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ది పనులకు సంబంధించిన పలు టెండర్లను ఆమోదించడం జరిగిందన్నారు. 2014-19 మద్య కాలంలో చేపట్టిన గజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.514.41 కోట్ల విలువైన టెండర్లకు, బాహ్య మౌలిక సధుపాయాల కల్పనకు రూ.194.73 కోట్ల విలువైన టెండర్లకు సీఆర్డిఏ సమావేశంలో ఆమోదం తెల్పడం జరిగిందన్నారు. నాన్ గజిటెడ్ ఉద్యోగుల నివాసానికి తొమ్మిది టవర్ల నిర్మాణానికి రూ.506.67 కోట్ల విలువైన టెండర్లకు, మరో 12 టవర్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు రూ.517.10 కోట్ల విలువైన టెండర్లకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. br br #Amaravati #CRDA #PonguruNarayana #Chandrababu #andhrapradesh #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 4.5K

Uploaded: 2025-05-06

Duration: 07:17

Your Page Title