వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సీఎం రేవంత్

వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సీఎం రేవంత్

CM Revanth Reddy Orders To Officials : ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాతావరణశాఖ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని ఆయన సూచించారు. మార్కెట్లలో ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. కాగా ద్రోణి, ఉపరితలం ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది.


User: ETVBHARAT

Views: 21

Uploaded: 2025-05-21

Duration: 01:27

Your Page Title